
MLC Kavitha- Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో శనివారం విచారణకు హాజరుకానుంది. ఈ క్రమంలో ఈ క్రమంలో శనివారం ఉదయం అక్బర్ రోడ్ లోని తన నివాసంలో ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు జాగృతి కార్యకర్తలకు కవిత బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈడి విచారణకు వెళ్లే ముందు ఆమె కార్యకర్తలను కలిశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆమె ఈడి ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈడి విచారణ నేపథ్యంలో ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది.. కవితను విచారణకు రమ్మని మార్చి 9న ఈడి నోటీసులు జారీ చేసింది. ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 11వ తేదీన విచారణకు హాజరవుతానని కవిత వెల్లడించిన నేపథ్యంలో.. అధికారులు ఆ తేదీని ఖరారు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలు వెల్లడించింది. సౌత్ గ్రూపునకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుణ్ పిళ్ళయి కవిత బినామీఅని పునరుద్ఘాటించింది.. ఈ కుంభకోణంలో “మేడమ్ కవితకు 33 శాతం” ముడుపులు అందినట్టు వివరించింది.. మొత్తం వ్యవహారాన్ని సిసోడియా, ఆప్ నేతల ప్రతినిధి అయిన విజయ్ నాయర్ నడిపించారని, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ రెడ్డి, రాఘవరెడ్డి తో కూడిన సౌత్ గ్రూప్ తో కుమ్మక్కయారని వివరించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించిన మనీష్ సిసోడియా రిపోర్టులో స్పష్టం చేసింది.. కాగా కవిత శనివారం విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రిమాండ్ రిపోర్టులో మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర పై మరింత స్పష్టత ఇచ్చింది. దీంతో పక్కా సాక్ష్యాధారాలతో ఆమె అరెస్టుకు ఈడి రంగం సిద్ధం చేసిందని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక కవితకు బినామీగా చెబుతున్న అరుణ్ ప్రస్తుతం ఈడి కస్టడీలో ఉన్నాడు. సిసోడియాను శుక్రవారం ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో వారిద్దరితో వేరువేరుగా, కలిపి కూడా కవితను ప్రశ్నించే అవకాశం ఉందని ఈడి వర్గాలు అంటున్నాయి.. నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు కవిత కూడా పలుసార్లు ఫోన్లు మార్చారని, వాటిని ధ్వంసం చేశారని ఈడి చెబుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ప్రశ్నించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ ఈడి విచారణకు సహకరించిన పక్షంలో కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు చాలామందిని ఈ కారణంతోనే అరెస్ట్ చేసింది. అరెస్టు చేసిన తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది.