Healthy lifestyle tips: ఆరోగ్యం మహాభాగ్యం అంటారు పెద్దలు. అంటే మన శరీరారోగ్యం ఎంత బాగుంటే అంత మంచిదని. ఆరోగ్యం బాగోలేకపోతే ఎన్ని సంపదలు ఉన్నా ఉపయోగముండదని.. నేటి ఆధునిక కాలంలో చాలామంది రోగాల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా శరీరం రోగాల కుప్పగా మారడంతో.. సంపాదించిన సంపద మొత్తం ఆసుపత్రిలో ఫీజులు, చికిత్సకు ఖర్చు చేస్తున్నారు.
రోగాలు వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లడం కంటే.. ముందుగానే శరీరాన్ని క్యూర్ చేసుకుంటే బాగుంటుంది. అందుకే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు వైద్యులు. రోగాలు రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. దానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చికిత్స కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
వెనుకటి రోజుల్లో మన పెద్దవాళ్లు ఉదయం 8 గంటల లోపు అల్పాహారం తినేవారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసేవారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏదో ఒక చిరుతిండి తినేవారు. సాయంత్రం ఏడు గంటలకు భోజనం పూర్తి చేసేవారు. నాటి కాలంలో శారీరక శ్రమ అధికంగా ఉండేది. పైగా తిన్న తర్వాత వెంటనే పనులు నిమగ్నం కావడం వల్ల కొవ్వు నిల్వలు అంతగా ఉండేవి కాదు. దీంతో వారి శరీరం లో జీవన క్రియలు సక్రమంగా ఉండేది. ఫలితంగా రోగాలు దరిచేరేవి కావు. మాంసం మితంగా తీసుకునేవారు. జంక్ ఫుడ్ అంతగా తినేవారు కాదు. శారీరక శ్రమ అధికంగా ఉండేది.
ఇప్పటికాలంలో తినే తిండి విషయంలో ఎవరూ సరైన సమయాలు పాటించడం లేదు. మాంసాహారం ఇష్టానుసారంగా తింటున్నారు. కొన్ని సందర్భాలలో అర్ధరాత్రి పూట కూడా ఆహారం తింటున్నారు. తిన్న తర్వాత వెంటనే విశ్రాంతి తీసుకుంటున్నారు. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా జీవనక్రియలు జరిగే తీరులో పూర్తిగా మార్పు వచ్చింది. ఫలితంగా మధుమేహం.. రక్తపోటు.. ఇంకా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. అధిక బరువు సమస్యను నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు.
ఇలాంటి రోగాలు రాకూడదనుకుంటే తినే తిండి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎనిమిది గంటలకు అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేయాలి. భోజనంలో ఎక్కువగా కాయగూరలు ఉండే విధంగా చూసుకోవాలి. దంపుడు బియ్యం లేదా ముడి బియ్యంతో అన్నం వండుకోవాలి. కొర్రలు లేదా అరిగెలు.. సామలు తింటే ఇంకా మంచిది. ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ శాతం తక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట ఉడకబెట్టిన శనగలు లేదా గింజలు తినాలి. రాత్రి 7 గంటలకు భోజనం పూర్తి చేయాలి. తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి.
ఇలా చేస్తే తిన్న తిండి జీర్ణం అవుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. జంక్ ఫుడ్ తినకపోవడం వల్ల శరీరంలో జీవన క్రియలు కూడా సక్రమంగా జరుగుతాయి. రక్తంలో కొవ్వు పేరుకుపోదు. శారీరక వ్యాయామం చేస్తే తీసుకున్న ఆహారానికి సంబంధించిన కేలరీలు కరిగిపోతాయి. అప్పుడు శరీరం లో జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. జీవన శైలి వ్యాధులు దరిచేరవు.. ఇలా చేస్తే గుండెపోటు.. రక్తపోటు.. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావు.
గమనిక
..
ఈ సమాచారం వివిధ వేదికల వద్ద సేకరించాం. ఇది వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. చికిత్స పొందడం అంతకంటే మంచిది.