సాధారణంగా ఎలాంటి ప్రశ్నకైనా సైన్స్ ద్వారా సమాధానం లభిస్తుంది. అయితే సైన్స్ కూడా సమాధానం చెప్పలేని కొన్నిమిస్టరీలు ఉన్నాయి. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో 7,000 సంవత్సరాల చరిత్ర ఉన్న దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది. బెంగళూరులోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయాన్ని మల్లేశ్వరం నంది గుడి అని కూడా స్థానికులు పిలుస్తారు.
Also Read: పువ్వులతో పూజ చేసేటప్పుడు పొరపాటున ఈ తప్పులు చేయకూడదు..?
ఈ ఆలయంలో శివలింగం రూపంలో మహాశివుడు పూజలందుకుంటారు. ఈ ఆలయంలో నంది నోటి నుంచి నిరంతరం జలం వస్తుంది. భక్తులు నంది నోటి నుంచి వచ్చే జలాన్ని పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చే నీరు ఆలయంలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళుతుంది. 1997వ సంవత్సరంలో ఒక నిర్మాణం కోసం పనులు చేస్తున్న సమయంలో కార్మికులు ఈ ఆలయాన్ని కనుగొన్నారు.
Also Read: శయనిస్తున్న దర్శనం కల్పించే శివుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..?
నంది నోటి నుండి నీరు శివలింగంపైకి వచ్చి ఆలయం మధ్యలో ఒక మెట్ల తొట్టెలోకి వెళ్లడం ఈ ఆలయం ప్రత్యేకత. అయితే నంది నుండి శివలింగంపై నీరు పడేలా ఏ టెక్నాలజీని వినియోగించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోతున్నారు. ఇక్కడి భక్తులు మాత్రం శివుని మహిమల వల్లే ఈ విధంగా జరుగుతోందని చెబుతున్నారు. పరమేశ్వరుడి పురాతన ఆలయాలలో ఒకటైన ఈ ఆలయన్ని ప్రతిరోజూ పదుల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అయితే కొన్ని నివేదికలు మాత్రం ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అని చెబుతున్నాయి. ఈ ఆలయంలో నంది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది కాబట్టి ఈ నందిని దక్షిణ ముఖ నంది అని కూడా పిలుస్తారు.