ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు భారత్ కెప్టెన్ రహనే సెంచరీ చేశాడు. దీంతో భారత్ స్కోరు 189 పరుగులకు దూసుకెళ్లింది. రన్ స్కోరుతో పట్టు బిగించడంతో ఆటగాళ్ల మధ్య ఉత్సాహం నెలకొంది. అంతకుముందు హనుమవిహారి 21, రిషబ్ పంత్ 28 పరుగులకు ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రహనేతో పాటు జడేజా ఉన్నారు. మరో ఆరు పరుగులు చేస్తే టీమిండియా స్కోరు ఆసీస్ కు సమం అవుతుంది.