
కరోనా కారణంగా రద్దయిన విమాన సర్వీసులను ప్రభుత్వం క్రమంగా పెంచుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలు రద్దయిన సర్వీసులను మే నెల 25న పున:ప్రారంభించారు. తొలుత ఆయా దేశాల్లో చిక్కిపోయిన వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు ‘వందే భారత్ మిషన్’ పేరిట సర్వీసులను ప్రారంభించింది. ఆ తరువాత 33 శాతంతో పర్మిషన్ ఇచ్చింది. జూన్ 26 నుంచి విడతల వారీగా అనుమతులు ఇస్తూ వస్తోంది. తాజాగా 80 శాతం పరిమితితో విమాన సర్వీసులను నడుపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కాగా మే నెల 25న 30 వేల మందికి సేవలు అందించిన విమానయాన రంగం నవంబర్ 30 నాటికి 2.52 లక్షల మందిని తమ స్వస్థలాలకు చేర్చింది. తాజాగా 80 శాతం పర్మిషన్ తో రాకపోకలు పెరగనున్నాయి.