spot_img
Homeజాతీయం - అంతర్జాతీయంSCO Summit: పాక్ ప్రధానిని చైనా పిలిచింది ఇందుకా.. మూలన కూర్చోబెట్టారు కదరా. ఇజ్జత్ పోయింది...

SCO Summit: పాక్ ప్రధానిని చైనా పిలిచింది ఇందుకా.. మూలన కూర్చోబెట్టారు కదరా. ఇజ్జత్ పోయింది పో

SCO Summit: ఇది మామూలు పరాభవం కాదు.. ఇజ్జత్ పోయింది. కనీసం ఎవరూ దేకలేదు. దగ్గరికి వెళ్తే గాని దగ్గరికి తీసుకోలేదు. అలాగని వ్యూహాత్మక వాణిజ్యం గురించి మాట్లాడలేదు. పెట్టుబడుల గురించి చర్చించలేదు. ఆసియాలో అది ఒక దేశం కాబట్టి.. అక్కడ కూడా జనం ఉంటారు కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో పిలిచారు కాబట్టి ఆ దేశ ప్రధాని వెళ్లిపోయాడు. అంటే తప్ప ఆయనకేదో ఘన స్వాగతం పలకలేదు. ఎదురేయి చైనా అధ్యక్షుడు వచ్చి పుష్పగుచ్చం అందించలేదు. కనీసం ఫోటో కూడా దిగడానికి ఆసక్తి చూపించలేదు. ఎక్కడ ఫోటో దిగితే డబ్బులు అడుగుతాడని భయంతో రష్యా అధినేత కూడా దూరం పెట్టాడు. ఒక రకంగా సెక్యూరిటీ గార్డ్ కంటే (ఇక్కడ సెక్యూరిటీ గార్డులు క్షమించాలి) హీనంగా మారిపోయింది అతని బతుకు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకోసం మాట్లాడుతున్నారో తెలియదు. అదేదో సినిమాలో చికెన్ బిర్యాని పెడతానంటే వచ్చాం. తినేసి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా అతని పరిస్థితి మారిపోయింది. ఇంతటి ఉపోద్ఘాతం చదివిన తర్వాత మీకు ఇప్పటికే స్ట్రైక్ అయిందనుకుంటా.. ఎస్.. ఇంతసేపు మీరు చదివింది పాకిస్తాన్ గురించి. ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గురించి.

Also Read: ఫర్ సప్పోజ్ కవిత ప్లేసులో ఇంకో నాయకుడు ఉంటే కెసిఆర్ ఏం చేసేవారు?

చైనాలో షాంగై కోఆపరేటివ్ సదస్సు జరుగుతోంది కాబట్టి డ్రాగన్ దేశ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని ని ఆహ్వానించాడు. ఇప్పుడు మన దేశం తో కొంతలో కొంత మైత్రి కుదిరింది కాబట్టి పాకిస్థాన్ అవసరం చైనాకు లేదు. రష్యాకు ఏమాత్రం అవసరం లేదు. భారత్ చమురు కొన్నంతవరకు రషకు డోకా లేదు. అందువల్లే భారత్ చెప్పింది మొత్తం చైనా విన్నది. చివరికి రష్యా కూడా విన్నది. అంతకు మించిన ప్రత్యామ్నాయం ఆ రెండు దేశాలకు లేదు. అందువల్ల పాకిస్తాన్ తో ఈ రెండు దేశాలకు అవసరం లేదు. ఫలితంగానే దాయాది దేశాన్ని డ్రాగన్, పుతిన్ పరిపాలిస్తున్న దేశం దూరం పెట్టాయి.. భారత్ ధోరణి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఇక్కడ ప్రస్తావన అనవసరం.

చైనా దేశంలో పాకిస్తాన్ ప్రధానికి జరిగిన ఘోరమైన అవమానంపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని.. ఇటీవలి కాలంలో ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో దారుణమైన అవమానం జరిగి ఉండదని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు..”అధికారికంగా గొప్ప స్వాగతం లభించలేదు. చర్చల్లో భాగస్వామ్యం దక్కలేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చాడు. పెట్టింది తిని వెళ్లిపోయాడు. వచ్చి రావడానికి ఫ్లైట్ ఖర్చులు దండగ. కనీసం ఈ డబ్బులు మిగిలి ఉంటే పాకిస్తాన్ ప్రజలకు కొంతలో కొంత అపరిమితమైన పన్నుల భారం నుంచి ఉపశమనం లభించి ఉండేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ దేశస్తులు వాస్తవ పరిస్థితిని గ్రహించాలని.. ప్రధానికి గౌరవం లేనిచోట ఆత్మభిమానం.. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదని హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper