
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న 50 వేలకు తగ్గిన కరోనా కేసులు బుధవారం విడుదల చేసిన బులిటెన్లో 63 వేలకు పెరగడం ఆందోళనను కలిగిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 72,39,390కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 730 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,10,586కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,26,876 యాక్టివ్ కేసులు ఉండగా.. 63,01,928 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.