
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84,62,081 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 577 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,25,562కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,16,632 యాక్టివ్ కేసులు ఉండగా.. 78,19,887మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా కరోనా రికవరీ రేటు 92.41 శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శీతాకం ప్రారంభమవుతుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారరు.