
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 45,576 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 585 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,58,483గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,31,578కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 83,983,370 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.58గా ఉంది.