
నిన్నటితో పోలిస్తే భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 41,810 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 496 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,36,696కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,53,956 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 88,02,267 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 93 లక్షల కేసులు దాటాయి. అయితే నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగింది.