
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 26,567 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 385 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,03,770గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,40,958కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,83,866 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 91,78,946గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 97 లక్షల కేసులు దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14,88,14,055 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.