దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో రెడ్, ఆరెంజ్ జోన్లలో మార్పులు చేసినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా తెలిపారు. పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు ప్రీతి సూడాన్ వెల్లడించారు. కొత్త జాబితా ప్రకారం రెడ్ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్ జోన్ లో 284, గ్రీన్ జోన్ లో 319 జిల్లాలు ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 19 జిల్లాలు, మహారాష్ట్ర లో 14, తమిళనాడు లో 12, ఢిల్లీ 11, పశ్చిమ బెంగాల్ 10 జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
తెలంగాణలో.. ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో, 18 ఆరెంజ్ జోన్ లో, 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్ జిల్లాలు: నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొమరం భీం, అసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట, మంచిర్యాల.
గ్రీన్ జోన్ జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి