టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో మొదటి ప్లేస్ లో ఉండే బ్యూటీ ‘పూజా హెగ్డే’. పూజా ఖాతాలో వరుస హిట్స్ పడటం, పైగా బాలీవుడ్ లోనూ ఈ భామకు బాగా డిమాండ్ పెరగడంతో పూజా రేంజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే, ఈ మధ్య పూజాకి ఒక పిచ్చి బాగా పట్టుకుందట. ఇంతకీ ఏమిటి ఆ పిచ్చి అంటే..
గేమ్స్.. అవును పూజ హెగ్డే ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటుందని.. టైం దొరికితే మొబైల్ లో, ట్యాబులో గేమ్స్ ఓపెన్ చేసి అందులో లీనమైపోతుందని ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే, గత కొన్ని రోజులుగా పూజాకి ఈ గేమ్స్ పిచ్చి బాగా ఎక్కువైపోయిందట. అయినా ఒకేసారి మూడు, నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండే పూజాకి గేమ్స్ ఆడే టైం ఎక్కడ నుండి వస్తోందో.
నిజానికి గేమ్స్ కి సమయం సరిపోక పోవడం వల్లే.. ఈ మధ్య ఒక కన్నడ సినిమాని కూడా వదులుకుంది ఈ టాల్ బ్యూటీ. ఇంతకీ తను గేమ్స్ ఆడటానికి కారణం చెబుతూ స్ట్రెస్ రిలీఫ్ కోసం గేమ్స్ ఎంచుకుంటున్నాను అంటుంది పూజా. అందుకే సోషల్ మీడియాలో కూడా పూజా తరుచుగా గేమ్స్ ఆడుతున్న ఫోటోలను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
కాగా ఈ క్రమంలో నిన్న ఆదివారం తన ఇంట్లో రిలాక్స్ అవుతూ ట్యాబులో ఒక గేమ్ ఆడుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. అయినా మిగిలిన హీరోయిన్లు తమ ఖాళీ సమయంలో వంటకాలకు సంబంధించిన వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటే.. పూజా మాత్రం గేమ్స్ మీద పడింది. ఇక పూజ హెగ్డే చేతిలో ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్’ లాంటి భారీ సినిమాలు ఉన్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pooja hegde became addicted to games
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com