spot_img
Homeఅత్యంత ప్రజాదరణసంజయ్ నీకు దమ్ముందా.. కేటీఆర్ సంచలన సవాల్?

సంజయ్ నీకు దమ్ముందా.. కేటీఆర్ సంచలన సవాల్?

ఇన్నాళ్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చిపోవడం.. దానికి టీఆర్ఎస్ శ్రేణులు మౌనంగా ఉండి లైట్ తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో జరిగింది. అనవసరంగా తెలంగాణ బీజేపీ నేతలను ప్రజల్లో హీరోలు చేయవద్దని గులాబీ అధిష్టానం మౌనంగా ఉంది. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుపు.. వరంగల్ లో ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ దాడి చేశాక ఇక టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ ఊపేక్షించడం లేదు. బీజేపీని టార్గెట్ చేసి కన్నుకు కన్ను.. తొడకు తొడ కొట్టేస్తున్నారు.

ప్రధానంగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్న బీజేపీ నేతలకు.. అదే కేంద్రంలోని బీజేపీ హామీలిచ్చి మరీ ఎగ్గొట్టిన సంగతులను గుర్తు చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్ పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాంచంద్రరావు ఉస్మానియా యూనివర్సిటీ వెళ్లి కేటీఆర్ కు సవాల్ చేయగా.. అంతే ధీటుగా కేటీఆర్ ‘కేంద్రంలోని మోడీ సార్ తెస్తానన్న నల్లధనం.. ఇస్తానన్న జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు ఏవీ అంటూ ’ కడిగేశాడు.

ఇప్పుడు టార్గెట్ బండి సంజయ్ లక్ష్యంగా కేటీఆర్ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ మంజూరైనా కేంద్రంలోని బీజేపీ ఇవ్వని వైనాన్ని కేటీఆర్ ఎండగట్టారు. ఐటీఐఆర్ తేలేని బీజేపీ.. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ను మూలకు పెట్టింది బీజేపీ ప్రభుత్వమని ఆరోపించారు.

ఐటీఐఆర్ గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరగా ఉందని కేటీఆర్ విమర్శించారు. సొంత పార్టీ కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అని ఆరోపించారు.

ఐటీఐఆర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చే దమ్ము బండి సంజయ్ కు ఉందా? రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ స్పష్టమైన ప్రకటన చేయించాలని కేటీఆర్ సవాల్ చేశారు. సంజయ్ కు దమ్ముంటే కనీసం ఒక్క ప్రాజెక్టును హైదరాబాద్ కు తీసుకురాగలరా? మీడియాలో ప్రచారం కోసం అసత్యాలతో లేఖ రాస్తారా? అని కేటీఆర్ కడిగేశాడు. టీఆర్ఎస్ సర్కార్ పై మీ చేతగానితనాన్ని దాచి అబద్ధాలు వేయడానికి సిగ్గు అనిపించడం లేదా అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

దీన్ని బట్టి ఇక కేటీఆర్ రంగంలోకి దిగాక మిగతా నేతలు కూడా బీజేపీని టార్గెట్ చేయడం ఖాయమని.. గులాబీ దండులో వచ్చిన ఈ మార్పును అందరూ గమనించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper