Homeఅత్యంత ప్రజాదరణదసరా నవరాత్రులు.. గాయత్రి దేవి అలంకరణలో దుర్గమ్మ!

దసరా నవరాత్రులు.. గాయత్రి దేవి అలంకరణలో దుర్గమ్మ!

నవరాత్రుల లో భాగంగా ఈ రోజు అనగా సోమవారం మూడు రోజులో భాగంగా అమ్మవారు చంద్ర ఘంటా రూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు ఇంద్రకీలాద్రిపై దర్శన భాగ్యం కల్పించారు. ఈ తొమ్మిది రాత్రులు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ వేడుకలో అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో కొలువై ఉంటారు. ఈ రోజు అమ్మవారు ముదురు ఎరుపు రంగు చీరలో పూజిస్తారు. 10 చేతులను కలిగి దుష్టశక్తులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమ్మవారు పులిపై స్వారీ చేస్తున్నట్లు దర్శనమిస్తారు.

గాయత్రి దేవి నుదిటిపై నెలవంక చంద్రబింబాన్ని తిలకంగా దిద్ది పూజిస్తారు. ఆ చంద్రుని పూజించటం ద్వారా ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోయి ప్రశాంతతను కల్పిస్తాడు. అందుకు ప్రతీకగానే గాయత్రి దేవి అమ్మవారి ని చంద్ర ఘంటా అని పిలుస్తారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం ద్వారా వారి మనస్సులో ఎలాంటి భయాందోళనలు లేకుండ ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగల శక్తిని ఈ అమ్మ వారు ప్రసాదిస్తారు.

నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెసర గారెలు, మినప గారెలు, లేదా మొక్కజొన్న తో చేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజా కార్యక్రమం ముగించుకొని గాయత్రి దేవి స్తోత్రం పఠించడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి సర్వ శక్తులను మనకు ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నవరాత్రుల లో భాగంగా అమ్మవారి దర్శనార్థం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నవరాత్రులను ఎంతో ఘనంగా, ఉపవాస దీక్షలతో పూజించడం విశేషం. ఈ విధంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular