అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాల వారు ఉంటేనే అది రాజధాని అవుతుందని.. ఫలానా కులం వారు.. మతం వారు ఇక్కడ ఉండొద్దంటే అది రాజధాని ఎలా అవుతుందని.. ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని మొత్తం చంద్రబాబు అండ్ కో ఆక్రమించి కమ్మ వాళ్లతో నింపేశారని అర్థం వచ్చేలా సీఎం జగన్ పరోక్ష విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ పైలాన్ ను సీఎం ఆవిష్కరించిన అనంతరం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అందరూ ఉన్న చోటునే రాజధానిగా చేద్దామని సీఎం జగన్ అన్నారు. అలాంటి సమాజాన్ని.. రాజధానిని మనం నిర్మించుకుందామన్నారు. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అవుతుందని.. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. అమరావతిలో 54వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్నారని.. నిన్న హైకోర్టుల్లో పిల్ వేశారని.. కొందరు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఓర్వలేకపోతున్నారని జగన్ విమర్శించారు.
ఏపీలో 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని అన్నారు. 28.30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇళ్లు, మరో 2.62 లక్షల టిడ్కో ప్లాట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇంతకంటే దేవుడు తనకిచ్చే వరం ఏమి ఉంటుందని అన్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Cm jagans sensational remarks on amravati
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com