Homeఅత్యంత ప్రజాదరణవిద్యార్థులకు గుడ్ న్యూస్: సీఎం జగన్ మరో సాహసోపేత నిర్ణయం..

విద్యార్థులకు గుడ్ న్యూస్: సీఎం జగన్ మరో సాహసోపేత నిర్ణయం..

ఏపీ సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు మారుపేరుగా మారిన జగన్ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు చేరువ అవుతున్నారు. అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకొని ఏపీ ప్రజలను.. ముఖ్యంగా విద్యార్థులను సంతోషంలో ముంచారు.

2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వ ‘సీబీఎస్ఈ’ సిలబస్ ను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులు, విద్యాకానుకపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించారు.

సీఎం మాట్లాడుతూ ‘ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024నాటికి పదోతరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. అమ్మఒడిలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల నాణ్యత, సర్వీసు బాగుండలన్నారు.

విద్యావ్యవస్థను ముఖ్యంగా విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో జగన్ కృషి, పట్టుదల అమోఘమని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను ఎవరూ తీసుకొని ఉండరని ప్రశంసిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular