Homeలైఫ్ స్టైల్Corona: కరోనా బాధితులకు అలర్ట్.. ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే?

Corona: కరోనా బాధితులకు అలర్ట్.. ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే?

Corona: దేశంలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో మరోసారి 2,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి.

Corona
Corona

ఒక అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 30 శాతం మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. డయాబెటిస్, అధిక బాడీ మాస్‌ ఇండెక్స్‌ సమస్యలతో బాధపడే వాళ్లను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తోందని సమాచారం అందుతోంది. అలసట, శ్వాస సంబంధిత సమస్యలు, వాసనను గ్రహించలేకపోవడం లాంటి లక్షణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కనిపిస్తే లాంగ్ కోవిడ్ గా గుర్తు పెట్టుకోవాలి.

Also Read: Samosa Rate In Delhi Airport: ఈ స‌మోసాల రేటు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్‌.. ఒక్కో స‌మోసా అంత రేటా..?

మరోవైపు కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కరోనా వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని వాళ్లు వెంటనే వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు చేపడుతుండటం గమనార్హం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం కరోనా వైరస్ పెద్దగా ప్రభావం చూపడం లేదనే సంగతి తెలిసిందే. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉంటే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది.

Also Read: Prashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?

Recommended Videos:

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

  1. […] AP News: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరు. ఏది కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షం. కొండ మీద కోతినైనా తేవచ్చు. అవసరమైతే రోడ్డు మీద వెళ్లే వారిని సైతం ఆపి వారి వాహనం లాక్కోవచ్చు. ఏమైనా అంటే సీఎం ఆదేశాలు మీరు ఏదైనా దారి చూసుకోండి అని ఉన్న పళంగా వాహనాన్ని లాక్కెళ్లిపోతారు. ఇక వారికి దిక్కెవరు? కంచే చేను మేస్తే చేసేదేమిటి? అని లోలోపలే కుమిలిపోవడం తప్ప వారు చేసేది లేదని తెలుస్తోంది. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు జరిగింది. సాక్షాత్తు ఒంగోలు పట్టణంలోనే ఈ వింత చోటుచేసుకుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular