సరిహద్దుల్లో ఘర్షణకు సంబంధించి మిజోరం పోలీసులు తనపైన, తన ప్రభుత్వంలోని నలుగురు ఉన్నతాధికారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తప్పుపట్టారు. ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని సజీవంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ రెండు రాష్ట్రాలకు మంచిది కాదని చెప్పారు. మిజోరం సీఎం జొరామ్ తంగ క్వారెంటైన్ ముగిసిన తర్వాత తనతో ఫోన్ లో మాట్లాడుతానని చెప్పారని తెలిపారు.