
తెలంగాణలో రెవిన్యూ వ్యవస్థ రైతుల పాలిట ఎంత శాపంగా మరిందో చెప్పడానికి తాజా ఉదంతాలు చాలని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. తాజాగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో భూ సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక ఓ మహిళ ఏకంగా తహశీల్ కార్యాలయం గమ్మానికి తాళిబొట్టును వేలాడదీసిందని గుర్తు చేశారు. అంతకు ముందు మెదక్ జిల్లాలోని తండాలో పట్టాదారు పాస్ బుక్ రావడంతో మాలోత్ బాబు అనే రైతు మరణించారని పేర్కొన్నారు.