ఆనందయ్య ఔషధ పంపిణీపై సోమవారం అంతిమ నిర్ణయం తీసుకొనే అవశాశం ఉందని రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. ఈ మందు వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో నే జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు చెప్పారు. కొవిడ్ కట్టడి చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆనందయ్య ఔషధం పైనా సీఎం చర్చించినట్లు రాములు తెలిపారు. ఆనందయ్య ఔషధం పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందని రాములు తెలిపారు.