
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడింది. నిప్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.42 వద్ద నిలిచింది.