గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అమ్మడు ఏమి చేసినా వార్త అయిపోతుంది. ప్రియాంకకు ఇండియాలో కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్ ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది.
ఆ తరువాత ఆ విల్లాని షారుఖ్ పూర్తిగా ఈ గ్లోబల్ బ్యూటీకే ఇచ్చేశాడు. అయితే తాజాగా ప్రియాంక గోవాలోని తన రెండు అపార్ట్మెంట్లను అమ్ముకుందని తెలుస్తోంది. ఆలాగే ముంబైలోని తన భారీ భవంతిని కూడా అద్దెకిచ్చింది అని టాక్. ఇక ముంబైలో ఉన్న తన షాపింగ్ మాల్ ను కూడా అమ్మే ఆలోచనలో ఉందట.
ఇక మహారాష్ట్రలోని అంధేరీలో తన తండ్రి నుండి ప్రియాంకకి ఓ బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ ను రూ. 13 కోట్లకు ఈ ఏడాది మార్చిలో అమ్మేసిందట. అసలు ప్రియాంక చోప్రా ఉన్నట్టు ఉండి ఎందుకు ఆస్తులు అమ్ముకుంటుంది ? అంటూ ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ప్రియాంక.. ఒషివారాలోని తన రెండంతస్తుల ఆఫీసును కూడా అమ్ముకుంది. అప్పుడంటే.. అమెరికాలో ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి, డబ్బు అవసరం అయి ఉంటుంది, దాంతో అమ్మేసుకుని ఉండి ఉంటుంది అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఎందుకు ప్రియాంక ఆస్తులు అమ్ముకుంటుందో అర్ధం కావడం లేదు.
అయినా ఇలా ఉన్నవన్నీ అమ్మేసుకుని అమెరికా పోయి భర్త చేతిలో పెడితే… భవిష్యత్తులో ఆ భర్తతో తేడా జరిగితే.. అప్పుడు ప్రియాంక పరిస్థితి ఏమిటి ? ఏమో.. ఆమెకే తెలియాలి.