
సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. ఈ నెల 19 న కరోనా పాజిటివ్ రావడంతో 22 వ తేదీన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో్ భాగంగా ఈ నెల 14 న హాలియాలో టీఆర్ ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే.