
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,376 పరీక్షలు నిర్వహించగా 1,908 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,80,258 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 22 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,513కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,46,370 మంది కోలుకున్నారు.