
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడచిన 24 గంటల్లో 62,856 మంది నమూనాలు పరీక్షించగా 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 1,311 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లురు, శ్రీకాకుళంలో ఒక్కరు మృతి చెందారు.