
భారత్ లో ఉన్న కోవిడ్ పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో అనేక రాష్ట్రల్లో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారని మరనాలు కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియేసిన్ తెలిపారు. ప్రపంచ దేశాలకు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మహమ్మారి సోకిన మొదటి ఏడాది కన్నా రెండవ ఏడాది మరింత ప్రమాదకరంగా ఉంటుందని, మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.