ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ నది వరద పెరుగుతుంది. వరద ముప్పు వున్న ప్రాంతాలకు నోటీసులు ఇస్తున్నారు అధికారులు.ఇందులో భాగంగానే కృష్ణ నది కరకట్టపై వున్న ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వరద ముప్పు వున్న ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.