
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోసారి 41వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,831 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా మరో 39,258 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 3,08,20,521 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 541 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 4,24,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి.