
కర్నూలు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు సంగమేశ్వర ఆలయంలోకి భారగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. దీంతో సంగమేశ్వర ఆలయంలో వరద జలాలు శివలింగాన్ని తాకాయి. సంగమేశ్వర ఆలయంలో అర్చకులు అంత్య పూజలు నిర్వహించారు. వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.







