spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kuppam development : బంగారు కుప్పం.. ఇదీ బాబు విజినరీ ఆలోచన..

Kuppam development : బంగారు కుప్పం.. ఇదీ బాబు విజినరీ ఆలోచన..

Kuppam development : చేపల దుకాణాలు కావు. మటన్ కొట్లు అంతకంటే కావు. బొబ్బట్లు.. అప్పడాల తయారీ కేంద్రాలు కావు. జాతి భవిష్యత్తు మొత్తాన్ని మార్చే కేంద్రాలు అవి. ఆ కేంద్రాలు పెద్దపెద్ద నగరాలలో నిర్మితమవుతూ ఉంటాయి. కానీ అవి ఏపీని వెతుక్కుంటూ వచ్చాయి. అక్కడితో ఆగిపోలేదు ఒక మారుమూల చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతానికి చేరుకున్నాయి. చేరుకోవడంతోనే సరిపోలేదు.. అక్కడ వేలకోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి.

ఇలాంటి ఆలోచన ఒక దార్శనికుడికి వచ్చింది . ఆయన పేరు చంద్రబాబు.. ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితం.. ఐటీని హైదరాబాద్ నగరానికి పరిచయం చేసిన నాయకత్వం.. అభివృద్ధిని.. సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేసిన దీర్ఘ దృష్టి ఆయన సొంతం. అందువల్లే ఏపీ ప్రజలు 2024లో ఆయన నాయకత్వాన్ని కావాలని కోరుకున్నారు. ఆయన అయితేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని భావించారు. ఫలితంగా చంద్రబాబు 2024 లో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి 3.0 చూపిస్తున్నారు. సరికొత్త రూపంలో ఏపీ ప్రజలకు కనిపిస్తున్నారు.

ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చిన చంద్రబాబు.. కేంద్రంలో చక్రం తిప్పుతూ.. ఏపీలో అద్భుతమైన పారిశ్రామిక అభివృద్ధికి నాంది పలుకుతున్నారు. ఏపీ రాష్ట్రానికి సరికొత్త దిశను దశను పరిచయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ మొదలైంది. ఏపీ బ్రాండ్ పేరుతో గోల్డ్ బిస్కెట్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అంతేకాదు అవి ఏపీ చరిత్రను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. జొన్నగిరిని కేజీఎఫ్ లాగా మార్చిన చరిత్ర చంద్రబాబుకుంది. అంతేకాదు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని కూడా జొన్నగిరి కంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో ఏకంగా 932 కోట్ల విలువైన పెట్టుబడులతో 30 పరిశ్రమలు రాబోతున్నాయి. జొన్నగిరి మాదిరిగానే కుప్పంలో కూడా గోల్డ్ ఉత్పత్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

వీటి ద్వారా ఏకంగా 87 వేల ఉద్యోగాలు లభించబోతున్నాయి. త్వరలో కుప్పం ప్రాంతంలో విమానాశ్రయం కూడా ఏర్పాటు కాబోతోంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న కుప్పం.. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ గా మారిపోతుంది. త్వరలోనే బంగారు కుప్పంగా రూపాంతరం చెందనుంది. ఫ్లెక్సీలు.. కటౌట్ లకు మాత్రమే పరిమితమైన వైసీపీ హయాంలో కుప్పం నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు నాయకత్వంలో కుప్పం బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఒక విజినరీ పాలనకు.. బటన్ నొక్కే నాయకుడికి ఇదే తేడా అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper