
తెలుగు సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడంపై తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబరు వరకు నిర్మాతలు వేచి చూడాలని ఒకవేళ అప్పటికీ థియేటర్లు తెరచుకోనట్లయితే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీ వేదికల్లో తమ సినిమాలను విడుదల చేసుకోవాలని కోరింది. లాక్ డౌన్ పరిస్థితుల వల్ల థియేటర్లు మూతపడటంతో చాలా కొత్త చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాల విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించారు. ఈ విషయం పై ఈనెల 7న మరోసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అవుతుందని తెలిపారు.