టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్యాలయం వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సుపథం టికెట్ల కోసం సుబ్బారెడ్డి కార్యాలయం వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. పదవి కాలం ముగియడంతో చైర్మన్ కార్యాలయాన్ని టీటీడీ మూసివేసింది. నేడు సుపథం టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు టిక్కెట్లు కేటాయించకపోతే ఎలా అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ చైర్మన్ కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిన వారందరికీ టిక్కెట్లు కేటాయిస్తామని టీటీడీ ప్రకటించడంతో భక్తులు శాంతించారు.