
పెగాసస్ పై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపి.. మధ్యంతర ఉత్తర్వులు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్ వేర్ కానీ ఉమయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది.
దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్టే వేర్ ఉపయోగించారా లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవారి చందర్ ఉదయ్ సింగ్ తో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్ పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్ కూడా ఒకరు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయానలి సుప్రీంకోర్టు భావించింది.
అయితే సాంకేతిక కమిటలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్ జస్టిస్ వెల్లడించారు. అతి త్వరలో సభ్యులను ఖరారు చేసే సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.