పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మే 2న జరిగే కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు సలహాలు సూచనలు ఇస్తారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అభ్యర్థులంతా తమ కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు.