mallu
డబుల్ బెడ్రూం ఇళ్లపై టీఆర్ఎస్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ప్రారగణంలో సీనియర్ నేతలతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్లోని ప్రతి అర్బన్ నియోజకవర్గానికి 10 వేల చొప్పున డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఒక్క జూబ్లిహిల్స్ ప్రాంతంలో 226 ఇళ్లు మాత్రమే కట్టించారన్నారు. నాంపల్లిలో 1800 ఇళ్లు కట్టామని చెబుతున్నా అక్కడ ఒక్క గృహం కూడా లేదని తెలిపారు. దీనిని భట్టి చూస్తే కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని విమర్శించరు.
Also Read: హైదరాబాద్ మునగడానికి నేతల కబ్జాల కారణమా?