
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 22,160 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 15,18,247 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 114 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,800 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 23,098 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు 12 లక్షల 99 వేల 313 మంది డిశ్చార్జ్ అయ్యారు.