
ఏపీలో గడిచిన 24 గంటల్లో 91,070 పరీక్షలు నిర్వహించగా 2,982 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,14,213 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 12,946 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,850 యాక్టివ్ కేసులున్నాయి.