ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్లో భాగంగా బుధవారం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు వన్డేల్లోనూ భారత్ ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ పరువు కోసమే ఆడాల్సి వస్తోంది. అయితే నేడు తమ ప్రదర్శనను చూసిస్తామని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ను కూడా గెలుపొంది క్లీన్ స్వీప్ చేయాలని ఆసీస్ సిద్ధమైంది. ఓపెనర్ మయాంక్ ఆగర్వాల్ స్థానంలో శుభ్ మన్ గిల్ వచ్చాడు. గత మ్యాచ్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో తీవ్రత చూపించలేకపోయారు.