Homeఆంధ్రప్రదేశ్‌బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు?

బీజేపీని చూసి జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు?

Jagan
బీజేపీ అంటేనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీకి బీజేపీ ఇచ్చిన షాక్‌ మామూలుది కాదు. అందుకే.. ఆయన బీజేపీ అంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో జరిగిన రెండు ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలే వీచాయి. దీనికితోడు బీజేపీ బలం పెరిగింది. ఓటు బ్యాంకు పుంజుకుంది. అయితే.. ఇప్పుడు ఏపీలోనూ అక్కడి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ అంటే భయం పట్టుకుందంట. అందుకే అర్జంటుగా బీజేపీ ప్రథమ శత్రువు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తమ వద్దకు రప్పించుకుని మరీ మంతనాలు సాగించినట్లు టాక్‌.

Also Read: అమిత్ షా – వైయస్ జగన్ గంటన్నర గూడుపుఠాణి కథేంటి?

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా అతి ముఖ్య కారణమని అంతా ఒప్పుకుంటారు. ఇన్ని నెలల పాలన తరువాత జగన్ ఇప్పుడు ఒక్కసారిగా ఇరుకున పడ్డారు. దాంతో మళ్లీ పీకేను లైన్‌లోకి తెచ్చారని తెలుస్తోంది. నిజానికి ఎన్నికల విషయంలో జనాలను ఎటు తిప్పాలి.. ఎలా అకట్టుకోవాలి అన్న దాని మీద వ్యూహాలు ఉంటాయి. కానీ.. పాలన విషయంలోనూ వ్యూహాలు ఉంటాయా అన్నది ఆలోచించాల్సిందే.

అయితే.. పీకేకు తెలిసింది మాత్రం జనాభిప్రాయాన్ని ఒడిసిపట్టడం. వారికేమి కావాలో తెలుసుకుని అలా పార్టీని తీర్చిదిద్దడం ఆయన నైజం. విగ్రహాల విధ్వంసం విషయంలో వైసీపీ సర్కార్ అడ్డంగా బుక్ అయింది. ఇది దావానలంగా హిందూ మతంలో వ్యాపించినట్లైతే జగన్ సర్కార్ బదనాం కావడం ఖయం. దాంతో దీని నుంచి బయటపడే సలహాలు జగన్ పీకే నుంచి కోరారని అంటున్నారు. ఇక ఏపీలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతో మొదలుపెడితే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరిగితే మరో మారు పీకే అవసరం తప్పనిసరి. దాంతో మళ్లీ పీకేను రప్పించుకుని మరీ జగన్ మంతనాలు జరిపారని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: రాజకీయాల నుంచి వైదొలగాలని కేసీఆర్ నిర్ణయించారా?

అయితే.. తిరుపతి లోక్‌సభ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా మెజార్టీ విషయంలో జగన్‌ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. దాన్ని ఎలా రాబట్టాలి అన్నది కూడా పీకే టీమ్ సలహాలు ఇవ్వాలని జగన్ కోరారట. ఇక బీజేపీ హిందూత్వకు విరుగుడు మీద కూడా పీకే స్టడీ చేసి వ్యూహం రూపొందిస్తారని అంటున్నారు. అంతే కాదు దేశంలో బీజేపీ వేగంగా దూసుకువస్తోంది. ప్రాంతీయ పార్టీల మీద కరకు పాదాలను మోపుతోంది. దాని బారి నుంచి రక్షించుకునే వ్యూహాలను కూడా పీకే రెండు తెలుగు రాష్ట్రాల సారథులకు అందించారని అంటున్నారు.

పీకే జగన్‌తో భేటీ ముగిసిన వెంటనే తెలంగాణ యంగ్‌ లీడర్‌‌, కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌తోనూ మంతనాలు జరిపారు. ఈ రెండు చోట్లా ఇద్దరు నాయకులూ వెలిబుచ్చిన సందేహాలు ఒక్కటేనని సమాచారం. బీజేపీ నుంచి ఎలా ఎదుర్కొని ముందుకుసాగడం అన్నదే ప్రధాన లక్ష్యం. ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌‌తో అక్కడ మమత గెలుపు అవకాశాలను కూడా రెండు రాష్ట్రాల నాయకులు వాకబు చేశారని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలలో అతి పెద్ద బలమైన నేత మమతనే బీజేపీ ఓడిస్తే ఇక తెలుగు రాష్ట్రాలకు కమలం ముప్పు తప్పదు అన్నది ఒక అంచనా. మొత్తానికి ఇరు రాష్ట్రాలకు మాత్రం ఈ కాషాయం గుబులు మాత్రం గట్టిగానే పట్టుకున్నట్లు అర్థమవుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular