ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కాగల కార్యం గందర్వులు తీర్చిన చందంగా బీజేపీని రేసు నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న కేసీఆర్కు టీడీపీ రూపంలో ఉపశమనం లభించింది. దీంతో ఈసారి ఓటమి తప్పదా అన్న సందిగ్ధంగో ఉన్న కేసీఆర్ నెత్తిన చంద్రబాబు పాలుపోశారన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన మనసులో ఉన్న పలు విషయాలను పంచుకున్నారు.
మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది.
మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిసిటీని పీక్స్కు తీసుకెళ్లాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సమాచార శాఖకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఇందులో జూన్ 2న ఒక్కరోజే రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహం బీజేపీ వద్ద స్పష్టంగా లేదు. బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎలా అధిగమించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఎన్నికల అధికారులు తమ యొక్క సొంత జిల్లాల్లో పని చేయరాదని.. ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి పని చేయరాదని తాజా నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే క్రిమినల్ కేసులు లేవని డిక్లరేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. అంతేకాదు అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
మెట్రో మరింత విస్తరించింది. ప్రస్తుతం నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కొద్ది సమయంలోనే చేరుకోవచ్చు. అలా మెట్రో రవాణా ఏర్పాట్లు చేయబడ్డాయి. దీంతో బస్సులు ఎక్కే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. బడా రాజకీయ నాయకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని సీబీఐ వాదిస్తోంది. ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు.
ఎండలు మండిపోతుండడంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్లో వర్షాలు కురువడంతో బీర్ల అమ్మకాలు గతేదికంటే తగ్గాయి. మేలో భానుడు భగ్గుమనడంతో మందుబాబులో బీర్లను నీళ్లలా తాగేశారు.
ఆడపిల్ల ఇంట్లో పెళ్లంటే మాటలా! హడావిడి ఉంటుంది. నారాయణ ఇంట్లో కూడా ఇలాంటి సందడి నెలకొంది..నగలు, కొత్తబట్టల కొనుగోలు.. క్యాటరింగ్, ఫంక్షన్ హాల్, మగపెళ్లి వారికి విడిది, విందు ఏర్పాట్లలో అతని కుటుంబం తల మునకలు అయ్యింది.
దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రైతు వేదికల వద్ద సమావేశాల నిర్వహణకు.. ఒక్కొక్క వేదిక వద్ద సౌండ్ సిస్టం, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఇతర ఏర్పాట్లు, వెయ్యి మందికి మాంసాహారం తో కూడిన భోజనాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారం ప్రతి మండలంలో నాలుగైదు రైతు వేదికలు ఉంటే..