Homeఆంధ్రప్రదేశ్‌లిక్కర్ మాల్సా? మధ్యపాన నిషేధం ఏది జగన్ సారూ?

లిక్కర్ మాల్సా? మధ్యపాన నిషేధం ఏది జగన్ సారూ?

ap alchohol

తాము అధికారంలోకి సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటిస్తామంటూ జగన్‌ ప్రచారంలో నుంచే చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటిచింది. ప్రతీ ఏడాది 20 శాతం దుకాణాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ.. గత ఏడాదిలోనే మొదటి సారి ఇరవై శాతం.. తర్వాత లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరో పదమూడు శాతం దుకాణాలను తగ్గించారు. దీంతో ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగానే కనిపించింది.
కానీ.. తాజాగా ఇచ్చిన కొత్త ఎక్సైజ్‌ విధానంలో ఈసారి దుకాణాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించారు.మామూలుగా అయితే మరో ఏడు శాతం అంటే సుమారుగా 300 దుకాణాల వరకు తగ్గించాలి. తగ్గించకపోగా.. ఇప్పుడు అదనంగా లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త ఎక్సైజ్ విధానంలో  ఎక్సైజ్‌ కమిషనర్‌ అనుమతితో లిక్కర్‌ మాల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఈ కొత్త ఎక్సైజ్‌ విధానం వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిప్రకారం ఏపీ వ్యాప్తంగా ఉన్న 2,934 మద్యం షాపులు కూడా నడుస్తాయి. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు నడుస్తున్నాయి. ఇక ముందు కూడా అలాగే నడుస్తాయి. లిక్కర్ మాల్స్‌ను కూడా ప్రభుత్వమే నిర్వహించనుంది. పెద్ద పెద్ద దుకాణాలను అద్దెకు తీసుకుని వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మామూలు మద్యం దుకాణాల్లో పాపులర్ బ్రాండ్లను విక్రయించడం లేదు. దానికి కారణాలపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ మాల్స్ పెట్టాలనుకున్న ప్రభుత్వం అక్కడ మాత్రం అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Also Read: జగన్ సంచలన నిర్ణయం… ఏపీ మహిళలకు శుభవార్త!

కరోనా విజృంభించినప్పటి నుంచి రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇక ఆదాయం పెంచుకునే విషయం మీదే దృష్టి పెట్టిన జగన్‌ సర్కార్‌‌ తాజాగా ఈ నిర్ణయం చేసింది. లిక్కర్‌‌తోనే ఆదాయం పొందొచ్చని భావించింది.ఆదాయం పెంపులో భాగంగా ఎక్సైజ్ శాఖలోనూ భారీగా కసరత్తు జరిగింది.  కోరుకున్న బ్రాండ్లు దొరకక రాష్ట్ర ఆదాయం కాస్త ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. అందుకే..ఇక్కడే ఖరీదైన మద్యం అమ్మితే ఆ ఆదాయం కూడా రాష్ట్రానికే వస్తుంది కదా అని అనుకుంటున్నారట. అలా చేయడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ కూడా ఆగిపోతుందని అంటున్నారు. ఒకటో తేదీ నుంచే లిక్కర్ మాల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular