
తెలంగాణలోని గాంధీ ఆస్పత్రి కంటే జైలే బెటరని అంటున్న ఎంఐఏ నేత అక్బరుద్దీన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి శాపనార్థాలు పెడుతాడో వేచిచూడాల్సిందేనని కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి అన్నారు. ఈమేరకు విజయశాంతి తనదైన శైలిలో కేసీఆర్ కు ఫేసు బుక్కులో చురకలాంటించారు. గతంలో ‘వైద్యుల రక్షణేది.. అందని పీపీఈ కిట్లు’ అంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ఓ ప్రతిక యజమానికి కరోనా సోకాలని కేసీఆర్ శాపనార్థాలు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే తాజాగా టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ గాంధీ ఆస్పత్రిలోని సదుపాయాలను సంచనల వ్యాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీకి కరోనా సోకాలని శాపనార్థాలు పెడుతారా? అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గారి శాపనార్థాలు తెలియకపోవడంతో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక తాము, కేసీఆర్ గారు ఒకటే గానుకు తమకు ముఖ్యమంత్రి శాపనార్థాలు పెట్టబోరనే ధీమాతో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని ఆమె అన్నారు. లేదా తాము శాపనార్థాలు అతీతులం కాబట్టి అక్బరుద్దీన్ తెలంగాణలోని ఆస్పత్రుల గురించి మాట్లాడి ఉండొచ్చని ఆమె అన్నారు. అయితే కేసీఆర్ శాపనార్థాలు గురించి తెలిసిన ప్రజలు మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలాంటి శాపనార్థాలు పెడుతారోనని భయపడిపోతున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరోనా శాపం పెడుతారా? లేక మిత్రపక్షం నేత కాబట్టి సర్దుకుపోతారా? అని భవిష్యత్ తేలనుందని ఆమె విమర్శించారు.