
టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ లో రెచ్చిపోయారు. మద్యం అమ్మకాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గతంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కాదని ట్వీట్ చేశారు. జగన్ వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందన్నారు.
వైన్ షాపులో ఉపాధ్యాయుల డ్యూటీపై పవన్ సీరియస్!
చంద్రబాబు రెండు నాలుకల్లో ఏది, ఎప్పుడు, ఏ లైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టమన్నారు. కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి అంటూ, షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడని పేర్కొన్నారు. సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారని తెలిపారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడని మనిషి మారడంతే అంటూ సెటైర్లు వేశారు.
ఉప్పల్ లోని హెరిటేజ్ ప్యాక్టరీలో నలుగురికి కరోనా, వారి వల్ల 25 మంది క్వారంటైన్ లో ఉన్నారని, వీరంతా సత్వరం కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ వార్త పబ్లిష్ కాకుండా, టెలికాస్ట్ కాకుండా మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా అంటూ ఎద్దేవ చేశారు.