Homeజాతీయ వార్తలుWhy Operation Sindoor Was Put On Hold: ఆపరేషన్ సింధూర్ ను భారత్ అందుకే...

Why Operation Sindoor Was Put On Hold: ఆపరేషన్ సింధూర్ ను భారత్ అందుకే సడన్ గా ఆపేసింది.. సంచలన నిజం వెలుగులోకి..

Why Operation Sindoor Was Put On Hold: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది యాత్రీకులు మరణించారు. దీనికి ప్రతిగా మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. తర్వాత పాకిస్తాన్‌ ప్రతిదాడులు ప్రారంభించడంతో భారత్‌ వాటిని తిప్పికొట్టింది. అదే సమయంలో భారత వైమానిక దళం..నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్, కిరాణా హిల్స్, సర్గోదా వంటి కీలక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌ భారత్‌ యొక్క సైనిక శక్తి ప్రపంచానికి చాటింది. అదే సమయంలో పాకిస్తాన్‌తోపాటు అమెరికా వెన్నులోనూ వణుకు పుట్టించింది.

కీలక స్థావరాలు ధ్వంసం..
మే 10, 2025న, నాలుగు రోజుల తీవ్రమైన డ్రోన్,క్షిపణి దాడుల తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సీజ్‌ఫైర్‌ ప్రకటించబడింది. అప్పటికే పాకిస్తాన్‌లోని కీలకమైన 11 ఎయిర్‌బేస్‌లను భారత్‌ కచ్చితమైన దాడులతో ధ్వసం చేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంగంలోకి దిగారు. పాకిస్తాన్‌ను శరణు కోరమని ఆదేశించారు. అదే సమయంలో దాడులు ఆపాలని భారత్‌ను అభ్యర్థించాడు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా భారత్‌ సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది.

అణు రాజకీయాలు ..
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై భారత దాడులు, పాకిస్తాన్‌ అణు ఆయుధ నిర్వహణ కేంద్రం (స్ట్రాటజిక్‌ ప్లాన్స్‌ డివిజన్‌) సమీపంలో జరగడం అమెరికాలో ఆందోళనలను రేకెత్తించింది. పాకిస్తాన్‌ తన నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కిరాణా హిల్స్‌ సమీపంలో రేడియేషన్‌ లీక్‌ ప్రచారం జరిగింది.

Also Read: చైనా టర్కీలకు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

అణ్వాయుధాలు అమెరికా చేతిలో..
మాజీ పాకిస్తానీ సైనికాధికారి ఇంతియాజ్‌ గుల్, సీఐఏ మాజీ అధికారి జాన్‌ కిరియాకౌ వంటి వ్యక్తులు పాకిస్తాన్‌ అణ్వస్త్రాలపై అమెరికా గణనీయమైన నియంత్రణ ఉందని సూచించారు. కిరియాకౌ, పాకిస్తాన్‌లో చాలా కాలం పనిచేసిన వ్యక్తిగా, నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ వంటి సైనిక స్థావరాలపై అమెరికా పర్యవేక్షణ ఉందని వెల్లడించాడు. 2011లో ఎన్‌బీసీ ఛానెల్‌ కూడా ఇలాంటి సూచనలు చేశాయి. ఈ నేపథ్యంలో భారత దాడులు అమెరికా సైనిక మౌలిక సదుపాయాలకు లేదా అణు ఆయుధాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది, ఇది సీజ్‌ఫైర్‌ కోసం దాని తక్షణ జోక్యానికి కారణమైంది.

Also Read: నెహ్రూ చేసిన పొరపాటును సరిదిద్దిన మోదీ.. ఏంటా పొరపాటు?

భారత్‌ వ్యూహాత్మక నిలుపుదల..
ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ గణనీయమైన విజయం సాధించినప్పటికీ, మే 10న సీజ్‌ఫైర్‌కు అంగీకరించి ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ ఉగ్రవాదంపై భారత్‌ యొక్క శూన్య సహన విధానాన్ని ప్రదర్శించిందని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పహల్గామ్‌ బాధితులకు న్యాయం చేసినట్లు పేర్కొన్నారు. భారత్‌ భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సమానమైన స్పందనను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular