Indian Navy: ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశ భద్రతకు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే సైనిక బడ్జెట్ భారీగా పెంచింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సరికొత్త ఆయుధాలు దేశీయంగా తయారుచేస్తోంది. ఉన్న ఆయుధాల సామర్థ్యం పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా నౌకాదళ సామర్థ్యం మరింత బలపడింది. మూడు అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకలను భారత నౌకాదళంలో అధికారికంగా చేర్చారు. జూన్ 21న కోల్కత్తాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో వీటిని అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలప్రవేశం చేయించారు. ఈ మూడు నౌకల పేర్లు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్. ఈ మూడు వాహనాలు రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి మరో మైలురాయిగా నిలుస్తాయి. మార్చి 30న అన్నీ డెలివరీ అయ్యాయి. 75 నుంచి 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌకలు వేలాది ఉద్యోగాలు సృష్టించాయి. దేశీయ పరిశ్రమలు, ఇంజనీర్ల సృజనాత్మకత, కార్మికుల కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు.
ఐఎన్ఎస్ దుణగిరి..
స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్నీలగిరి శ్రేణి (ప్రాజెక్టు 17ఏ)లోని ఐదవ ఫ్రిగేట్ను గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ)లో తయారు చేశారు. దీని పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. వేగం 32 నాట్లు వరకు చేరుతుంది. ఎనిమిది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు, 32 బారక్–8 ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, 76 మిమీ సూపర్ రాపిడ్ గన్, ఏకే–630 క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్, టాల్ ష్యేనా టార్పెడోలు, ఆర్బీయూ–6000 రాకెట్ లాంచర్లు వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థలతో కలిసి ఉంటుంది. ఎల్ఎం–2248 ఎంఎఫ్–స్టార్ ఏఈఎస్ఏ రాడార్, హుమ్సా–ఎన్జీ సోనార్, శక్తి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వంటి సెన్సార్లు, హెలికాప్టర్ ఆపరేషన్ సామర్థ్యం దీన్ని బహుముఖ యుద్ధ వేదికగా మార్చాయి. సముద్ర, వాయు, భూమి లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోగలదు.
ఐఎన్ఎస్ సంశోధక్…
హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసెల్ (సాంధయక్ శ్రేణి)జీఆర్ఎస్ఈలో నిర్మించిన ఈ సర్వే నౌక సముద్ర భౌగోళిక అధ్యయనాలు, ఓడరేవులు, లోతైన సముద్ర మార్గాల సర్వేలు చేయడానికి రూపొందించబడింది. పొడవు 110 మీటర్లు, బరువు సుమారు 3,400 టన్నులు. వేగం 18 నాట్లు మించి. డేటా అక్విజిషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయువీ), రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్(ఆర్వీ), డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్, డీజీపీఎస్ లాంగ్ రేంజ్ పొజిషనింగ్ వంటి అధునాతన పరికరాలతో అమర్చారు. నావిగేషన్ మార్గాల నిర్ణయం, మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పెంపుకు, విపత్తు సమయంలో సహాయక చర్యలకు ఉపయోగపడుతుంది. రెండు డీజిల్ ఇంజిన్లతో నడుస్తుంది.
ఐఎన్ఎస్ అగ్రయ్..
వాటర్ క్రాఫ్ట్యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూ సీ) శ్రేణిలో నాలుగోది. జీఆర్ఎస్ఈలో తయారైంది. పొడవు 77.6 మీటర్లు. భారత నౌకాదళంలోని అతిపెద్ద వాటర్ జెట్ ప్రొపల్షన్ వాహనాల్లో ఒకటి. లైట్ వెయిట్ టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, షాలో వాటర్ సోనార్ వంటి వ్యవస్థలతో తీరప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించి ఎదుర్కోవడానికి రూపొందించారు. మైన్ వార్ఫేర్, లిటోరల్ ఆపరేషన్స్కు కూడా సహాయపడుతుంది. 80 శాతం స్వదేశీ కంటెంట్తో నిర్మించిన ఈ క్రాఫ్ట్ తీర రక్షణను బలపరుస్తుంది.
ఈ మూడు నౌకలు భారత నౌకాదళం ామర్థ్యాన్ని, సముద్ర భద్రతను మరింతగా పెంచుతాయి. అధునాతన సాంకేతికత, స్వదేశీ నిర్మాణం వల్ల దేశం రక్షణ దిగుమతిదారు నుంచి రక్షణ నిర్మాతగా మారుతోందని ఈ కమిషనింగ్ స్పష్టం చేస్తుంది.
