లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్దిక ఇబ్బందుల నుండి బైట పడటం కోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై సగం మేరకు కొత్త విధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం వారి సంఘాలతో సంప్రదింపులు కూడా జరుపకుండా ఇటువంటి నిర్ణయం ఏకపక్షంగా ఏ విధంగా తీసుకుంటారని నిలదీశారు.
ముఖ్యమంత్రికి వ్రాసిన ఒక లేఖలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిలోపట భరోసా కల్పించాల్సిన సమయంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. జీవన వ్యయ ప్రమాణాలకు అనుగుణంగా వేతన సవరణ జరగక, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ నిర్ణయం అశనీపాతం కలిగిస్తుందని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాల విషయంలో, ఇటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. వేతనంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగుల వేతనాల్లో ఏక పక్షంగా 50 శాతం కోత విధిస్తే కుటుంబాల జీవన పరిస్థితి అస్తవ్యస్థమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
స్వయంగా ప్రధాన మంత్రి లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగస్తుల, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని చెప్పారని గుర్తు చేశారు.
కానీ, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంను అలుసుగా తీసుకొని, ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారస్తులు, తమ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల, కార్మికుల జీతాల్లో కోతలు విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు . భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని విస్మయం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక, సహాయక చర్యల్లో పలు శాఖల ఉద్యోగులు అహర్నిశలు పని చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంపుదలకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ . ఉద్యోగుల, పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకుని తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ఆరోగ్య శాఖ, వైద్యులు, నర్సులు, నాలుగవ తరగ తి సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది కి పూర్తి వేతనాలు చెల్లించటం తో పాటు, వారికి మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రిని వెంటనే సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. య్ కోరారు.