Homeజాతీయ వార్తలుTamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ చేసింది కరెక్టే.. గతంలో ఏం జరిగిందంటే..

Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ చేసింది కరెక్టే.. గతంలో ఏం జరిగిందంటే..

Tamil Nadu Governor: ఎక్కువ సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా తమిళనాడు గవర్నర్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీవీకే నేతలు కూడా అదే స్వరాన్ని వినిపిస్తున్నారు. కమలహాసన్, ప్రకాష్ రాజు, విశాల్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. వాస్తవానికి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విషయంలో టీవీకే నేతలకు ఆగ్రహం ఉండడం సర్వ సాధారణం. కానీ తమిళనాడు గవర్నర్ ఇప్పటి పరిస్థితిని కాకుండా
.. గతంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కుప్ప కూలిపోయాయి

1996లో పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 161 సీట్లను సాధించింది. అతిపెద్ద పార్టీగా అవితరించింది. కానీ మెజారిటీ నిరూపించుకోలేకపోయింది. నాడు ఎంపీల లెక్కల పరిశీలించకుండానే రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేవలం 13 రోజుల పాటే ఆ ప్రభుత్వం కొనసాగింది. పార్లమెంట్లో బలం నిరూపించుకోలేకపోయింది. నాడు రాష్ట్రపతి సంఖ్యాబలాన్ని లెక్కలకు తీసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారాలు కూడా చేయించారు. నాడు శంకర్ దయాల్ శర్మ ఈ వ్యవహారంపై అనేక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని 1998లో పార్లమెంటు ఎన్నికల్లో హాంగ్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నాటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ ఈసారి కొత్త విధానాన్ని పాటించారు. అన్నా డీఎంకే నుంచి మొదలు పెడితే మొదటి ఇస్తున్న ఇతర పార్టీల నుంచి లేఖలు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి ఆహ్వానించారు. నాడు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో 13 నెలలు మాత్రమే కొనసాగింది.

2018లో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్.. 37 సీట్లు వచ్చిన జిడిఎస్ కలిసి.. మొత్తం 117 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ నాటి గవర్నర్ వాజుభాయ్ అతిపెద్ద పార్టీ గా నిలిచిన బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో.. మూడు రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.

2019లో మహారాష్ట్రలో బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. పైగా శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. నాటి గవర్నర్ భగత్ సింగ్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. దేవేంద్ర ఫడ్నవిస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ బల నిరూపణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభుత్వం కేవలం నాలుగు రోజుల్లోనే కుప్పకూలిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular