Homeజాతీయ వార్తలుVanama Venkateswara Rao : అనర్హత పై సుప్రీం స్టే: కొత్త గూడెం ఎమ్మెల్యే ఆయనేనా?

Vanama Venkateswara Rao : అనర్హత పై సుప్రీం స్టే: కొత్త గూడెం ఎమ్మెల్యే ఆయనేనా?

Vanama Venkateswara Rao : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వనమా అర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి రెండు వారాల్లో కౌంటర్‌ ఫిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2018 డిసెంబరులో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన ప్రత్యర్థి జలగం వెంకట్రావ్‌ 2019జనవరిలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న అనంతరం జూలై 25న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని, ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని హైకోర్టు తీర్ప చెప్పింది. అంతేకాకుండా రూ.5లక్షల జరిమానా విధించింది. 2018డిసెంబరు 12 నుంచి జలగం వెంకట్రావే కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వనమా వెంకటేశ్వరావు ఈ తీర్పుపై స్టే కోరుతూ తొలుత హైకోర్టునే ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై సోమవారం స్టే విధించింది. సుప్రీంకోర్టులో వనమాకు ఊరట లభించడంతో కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వనమా అభిమానులు మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చారు.

ఎమ్మెల్యేగా వనమా కొనసాగే అవకాశం..

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే కొనసాగించేంత వరకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నాలుగు వారాల తరువాత జరిగే విచారణ అనంతరం ఒక వేళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఆమోదిస్తేనే వనమా పూర్తిగా అనర్హుడై మళ్లీ జలగం వెంకట్రావ్‌ ఎమ్మెల్యేగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం వనమా వెంకటేశ్వరరావే కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆయన అసెంబ్లీకి కూడా వెళ్లవచ్చు.

2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన సమీప ప్రత్యర్థి, అప్పటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి జలగం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు వనమా ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.. అంతేకాకుండా ఆయనకు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికల్లో జలగం వెంకట్రావు విజేత అని, 2018 డిసెంబర్ 12 నుంచి ఆయనే ఎమ్మెల్యే అని ప్రకటించింది.

వనమా వెంకటేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీ ఫామ్ తెచ్చుకున్నారు. ఇవే నాకు చివరి ఎన్నికలంటూ ప్రచారం చేశారు. దీంతో జనాల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. తన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు మీద గెలిచారు. అయితే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం తప్పులు ఉన్నాయని, ఆస్తులకు సంబంధించిన వివరాలను తప్పుగా ప్రకటించాలని వెంకటరావు ఆరోపించారు. ఆరోపించడం మాత్రమే కాకుండా ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఎప్పుడైతే జలగం వెంకట్రావు సుప్రీంకోర్టుకు వెళ్లారో.. అప్పుడే వనమా వెంకటేశ్వరరావు తెలివిగా భారత రాష్ట్ర సమితిలో చేరారు. భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత జలగం వెంకట్రావు కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తో చెప్పించారు. కేసు ను కూడా విత్ డ్రా చేసుకోవాలని ఆయన ద్వారా చెప్పించేలా చేశారు. అయితే దీనికి ఒప్పుకోని జలగం వెంకట్రావు కేసు విషయంలో ముందుకే వెళ్లారు.

సుదీర్ఘకాలం విచారణ

2019లో సుప్రీంకోర్టు తలుపు తట్టిన జలగం వెంకట్రావు.. ఈ కేసు విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. పైగా న్యాయపరంగా అనేక ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదలాయించింది. అయితే వనమా వెంకటేశ్వరరావు తనకున్న రాజకీయ బలం ద్వారా ఆ కేసును పలుమార్లు వాయిదా వేయించుకున్నప్పటికీ చివరికి న్యాయం గెలిచింది. ఎన్నికల అఫిడవిట్ లో వెంకటేశ్వరరావు తప్పుడు వివరాలు సమర్పించారని హైకోర్టు భావిస్తూ ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడంటూ పేర్కొన్నది.. అంతేకాకుండా ఐదు లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించిన విషయం విధితమే.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular