spot_img
Homeఆంధ్రప్రదేశ్‌బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?

బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?


రాజకీయ పార్టీలకు, విగ్రహాలకు విడదీయరాని సంబంధం ఉంటుందని అందరికీ తెల్సిందే. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన నేత విగ్రహాలను ఆవిష్కరించి ప్రచారం చేసుకోవడం అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేమీ కొత్తకాదు. దివంగత ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను టీడీపీ, వైసీపీ పోటీపోటాగా అన్ని ప్రాంతాల్లో ఆవిష్కరిస్తూ విగ్రహాల రాజకీయాలకు పాల్పడుతుంటడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను అనేకచోట్ల ప్రతిష్టించారు. తమ పార్టీ నేత విగ్రహాలు అన్నిచోట్ల ఉంటే అక్కడి ప్రాంతవాసులంతా తమనే గుర్తించుకుంటారనే కోణంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ వారివారి నేతల విగ్రహాలను ఆవిష్కరించేందుకు పోటీపడుతుంటాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు తానే అధికారంలో శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచనతో వీలైన ప్రతీచోట ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే కిందటి ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

వైసీపీలో షాడో మినిష్టర్లు.. జగన్ కు కొత్త తలనొప్పి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేసిన సమయంలో చాలాచోట్ల దివంగత వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ విగ్రహాలను చాలాచోట్ల పెట్టనీయకుండా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల అప్పటికే ప్రతిష్టించిన విగ్రహాలను తీయించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో మాజీ ఎంపీ లడగపాటి రాజగోపాల్ తనకెంతో ఇష్టమైన పోలవరం డిజైన్ బ్యాగ్రౌండ్ తో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడంలో అప్పట్లో తీవ్ర దూమారం రేపింది. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్మించిన ఈ విగ్రహాన్ని ప్రభుత్వం కావాలనే తొలగించిందని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. నెల్లూరు జిల్లా కావ‌లి కూడ‌లిలో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని స్థానిక వైసీపీ నేతలు తొలగించారనే ప్రచారంతో టీడీపీ రంగంలోకి దిగింది. ఈ అంశాన్ని స్థానిక టీడీపీ నేతలు సీరియస్ తీసుకొని వైసీపీపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వైసీపీ నాయకులకు వణుకుపుట్టేలా చేయాలని టీడీపీ శ్రేణులను పిలుపునిచ్చారు.

ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!

ఇదంతా బాగానే ఉన్నా బాబు పిలుపు మేరకు త‌మ్ముళ్లు దూకుడుగా వెళితే వారిని కాపాడేవారు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు జైల్లో మగ్గుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో నేతలు దూకుడుగా వెళ్లి అరెస్టయితే ఎవరు తమను బయటికి తీసుకొస్తారనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. మాజీ మంత్రులకే ఇప్పటివరకు బెయిల్ దొరకడం లేదని ఇక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతే వారి పరిస్థితి ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో చంద్రబాబు ఆవేశానికి నేతలు బలికావాల్సిందేనా? అంటూ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper